భావోద్వేగంతో తన తల్లికి ట్విట్ చేసిన చిరంజీవి .!

టాలీవుడ్లో హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రెండొవసారి కరోనా బారిన పడిన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు .రెండోసారి చిరంజీవికి కరోనా అని తెలియగానే అభిమానులు తో పాటు అయన కుంటబసభ్యులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు . అయితే ఈ హోమ్ క్వారంటైన్ లో ఉండగానే చిరంజీవి తల్లి అయినా శ్రీ అంజనా దేవి గారి జన్మదినం కావడంతో చిరు తన సోషల్ మీడియా ద్వారా తన విషెష్ ని తెలియజేసారు. అయితే ఆమె ప్రతి పుట్టినరోజు కి ముగ్గురు కొడుకులు ,కూతుళ్లతో ఒకరకమైన పండగా చేసుకొనేవాళ్ళు మెగా ఫ్యామిలీ.

అయితే మెగాస్టార్ ఏమి ట్విట్ చేసారంటే అమ్మా ..జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు” అంటూ తన తల్లికి శుభాకాంక్షలు

తెలియజేసారు.