క్యాన్సర్ తో చావు అంచులు దాకా వెళ్లొచ్చిన హీరోయిన్లు

సినిమా జనాలు అనగానే జనాలు వారిని గొప్పగా ఊహించుకుంటారు. సాధారణ జనాల కంటే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ.. వారి జీవితం లగ్జరీగా ఉండొచ్చు కానీ.. వారు మనుషులే.. మనకున్నట్లే కష్టసుఖాలు వారికీ ఉంటాయి. మనగాలే వారు కూడా రకరకాల సమస్యలతో బాధపడ్డారు. చాలా మందిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే హీరోయిన్లు మాత్రం చావు నుంచి లేచి వచ్చారని చెప్పుకోవచ్చు. వీరిని భయంకరమైన వ్యాధులు అంటుకున్నాయి. చావు అంచు వరకు వెళ్లారు. కానీ వీరి అద్రుష్టం బాగుండి తిరిగి కోలుకున్నారు. ఇంతకీ చావుదాకా వెళ్లి వచ్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

*శీలా కౌర్
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబోలో వచ్చిన పరుగు సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతాకోక చిలుక, మస్కా, అదుర్స్ లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈమె ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురైంది. తీవ్ర ఇబ్బందులు పడింది. ఒకానొక సమయంలో సీరియస్ కండీషన్ లోకి వెళ్లింది. కానీ చివరకు కోలుకుంది.

*మమతా మోహన్ దాస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా భయంకరమైన వ్యాధికి లోనైంది. 25 ఏండ్ల వయసులోనే రక్త క్యాన్సర్ కు గురైంది. ఈ సమయంలో తనను భర్త వదిలేశాడు. అయినా ధైర్యంగా పోరాడి గెలిచింది.

*మనీషా కోయిరాలా
ఈమె కూడా హీరోయిన్ గా మంచి ఊపులో ఉన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. చికిత్స తర్వాత తను కోలుకుంది. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నా సినిమాలుమాత్రం చేయడం లేదు.

*సొనాలి బింద్రే
ఈమె మహేష్ బాబు మురారి సినిమాతో తెలుగు జనాలకు దగ్గరైంది. ఆ తర్వాత తను క్యాన్సర్ బారిన పడింది. దీంతో తను పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మారింది. ఆ తర్వాత వైద్య చికిత్సలు తీసుకుని చివరకు కోలుకుంది.

*గౌతమి
ఈమె కూడా రొమ్ము క్యాన్సర్ కు గురైంది. అయితే తను చికిత్స తీసుకుని మామూలుగా మారిపోయింది.