ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం”ఆది పురుష్”. ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి సనన్ నటించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే శ్రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ పార్ట్, సీత పాత్రధారిణి కృతిసనన్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. అయితే తాజాగా ప్రభాస్ షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఓం రౌత్ తెలియజేశారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ముంబైలో సెట్లోనే కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ సభ్యులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.