మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు, నటి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా దెయ్యంలా మారి.. అందరినీ భయపెట్టేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న హాలోవీన్ పండగ. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది.
హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత భయానక దుస్తులు ధరించి ఎంతో హుషారుగా `హాలోవీన్ డే`ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే నిహారిక సైతం గత రాత్రి దెయ్యంగా మారిపోయి హాలోవీన్ పండగను గ్రాండ్గా జరుపుకుంది.
ఇక నిహారికనే కాదు ఆమె భర్త చైతన్యను కూడా దెయ్యం గా మార్చి అందరిని భయపెట్టించింది. మొత్తానికి వీరిద్దరి షాకింగ్ లుక్స్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. కాగా, గతంలో వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, చిరంజీవి వంటి వారు కూడా హాలోవీన్ గెటప్లోకి మారి సందడి చేసిన విషయం తెలిసిందే.