జగన్ వల్ల టాలీవుడ్ కు అన్ని కోట్లు నష్టం వచ్చిందా..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాల పై పడటం గమనార్హం. జగన్ ఈ నిర్ణయం వల్ల రాబోయే సినిమాలో టాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక రాబోయే సినిమాలు అన్ని పెద్ద సినిమాలే కావడం వల్ల టికెట్ రేటు తగ్గించడంతో ఆ ప్రభావం సినిమాల పై పడనున్నట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఏపీలో సిడేడ్ హక్కులు 47 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే టికెట్ రేటు తగ్గింపు వల్ల ఆ బిజినెస్ కాస్త 38 కోట్ల రూపాయలకు తగ్గించారు ఆన్నట్లు తెలుస్తోంది.ఇక పుష్ప సినిమా కూడా 85 కోటి రూపాయల వరకు బిజినెస్ జరగదు టికెట్ల రేపు తగ్గించడంతో 15 కోట్ల రూపాయల వరకు తగ్గింపు ఉన్నట్లు సమాచారం. ఇక అలాగే ఆర్.ఆర్ ఆర్ 28 కోట తగ్గింపుతో 112 కోటి రూపాయలు మార్కెట్ చేశారని తెలుస్తోంది.

ఇక అలాగే ఆచార్య,F 3 సినిమా రేటు తగ్గింపు వ్యవహారంపై కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆ నిర్మాతలు తెలియజేశారు. జగన్ ఈ నిర్ణయం వల్ల దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా సమాచారం.