ఈ నటి ఫ్యామిలీలో ఏకంగా 5 మంది మరణించారట..!

దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు ఎంతో మంది చనిపోయారు. వారితో పాటు కొంత మంది ప్రముఖులు కూడా మరణించడం జరిగింది. కరోనా పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది

అయితే సెలబ్రిటీలు కూడా ఈ కారోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా సీనియర్ నటి వరలక్ష్మి కూడా తన వాళ్లను కరోనా వల్ల చనిపోయారని కన్నీటి పర్వంతం అయ్యింది. తాజాగా సుమా చేసేటువంటి క్యాష్ ప్రోగ్రాం లో ఈమె గెస్ట్ గా వచ్చింది. ఈ షో ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది. ఈ షోకు ఈమెతో పాటు ఆమని, యమునా, దివ్యవాణి, వరలక్ష్మి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్వతం అయింది. తన విషయాలను విన్న తోటి యాంకర్స్, కంటెస్టెంట్ లతో అందర్నీ కన్నీళ్లు పెట్టుకుని ఎలా చేసింది. కరొనా తన కుటుంబంలో ఏకంగా 5 మంది చనిపోయారని చెప్పుకొచ్చింది. అందులో తన చెల్లెలి మాత్రం చావు అంచులు వరకు వెళ్లి వచ్చింది అని చెప్పుకొచ్చింది. తన చెల్లెలి భర్త కూడా చనిపోవడం తో తనని చూడడానికి, పూడ్చడానికి ఎవరు రాలేదని చెప్పుకొస్తూ తను ఒక్కటే భర్త మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్ళింది అని చెప్పుకొచ్చింది. అలాంటి కష్టం ఎవరికీ రాకూడదని కూడా ఆరోపిస్తోంది.