దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఏకంగా రూ.5 తగ్గింపు..!!

ప్రస్తుతం వాహన ఇంధనం అయిన పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు నిత్యావసరం గా మారిపోయిన ఈ పెట్రోల్ అలాగే డీజిల్ ధరల పెరుగుదలతో పేద , మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.. అందుకే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది.. ఇక ఈ దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

ప్రస్తుతం పెట్రోల్ లీటర్ పై ఎక్సైజ్ సుంకం రూ.5 రూపాయలు తగ్గించగా, లీటర్ డీజిల్ పై రూ.10 రూపాయల తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొనడం జరిగింది. ఇక ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి..ఇప్పటికే వంట నూనె ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..తాజాగా పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గించి అందరికీ ఊరట కలిగించింది.. ఈ ధరల తగ్గింపు అనేది ఎంత కాలం ఉంటుందో వేచి చూడాలి.