బిగ్ బ్రేకింగ్: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్.. వీడియో వైరల్..!

డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఈక దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగును ప్రోమో లో విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇక ఈ ఈ పాటలు నవంబర్ 5వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా పూజా హెగ్డే హవానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈమె నటించిన ప్రతి చిత్రం కూడా హిట్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా కూడా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుంది తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.