విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇంత సడెన్గా ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం చేయడానికి కారణం ఏంటా అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మా ఎన్నికలకు ముందు ఓ తమిళ్ మూవీ షూటింగ్ లో ప్రకాష్ రాజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనే సర్జరీ కూడా చేయించుకుని కోలుకున్నారు. అయితే తాజాగా ఫుల్ బాడీ చకప్ చేయించుకున్న ప్రకాశ్ రాజ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
`డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఐయామ్ రాకింగ్. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి అవసరం. అందుకే మౌనవ్రతం చేస్తున్నా. మౌనం ఆనందాన్ని ఇస్తుంది` అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ కాస్త వైరల్గా మారింది.
https://twitter.com/prakashraaj/status/1460210490156584963?s=20