ఒక మహిళ కథను మరో మహిళే చెప్పగలదు: పూజా హెగ్డే?

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. పి డి వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి జరిగిన సంగీత్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ నా ఫ్యామిలీ బ్యానర్. ఈ సినిమాతో చాలా డబ్బులు మరింత గౌరవం రావాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.

ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మహిళ అతను మరొక మహిళ చక్కగా చెప్పగలదు. లక్ష్మి గారికి వరుడు కావలెను సినిమాతో మంచి సక్సెస్ రావాలి అదేవిధంగా నాగశౌర్య కూడా సెల్ఫ్ మేడ్ హార్డ్ వర్కర్ అని పూజ హెగ్డే చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు రీతు వర్మ కూడా మంచి హిట్ రావాలి.వరుడు కావలెను లాంటి సినిమాలు థియేటర్లో ఫ్యామిలీతో చూడాలి అని హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. మా కుటుంబం బాగుంటుందని చాలా మంచిదని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. ఈ సినిమా బాగా వచ్చింది అని నేను అంతే గర్వంగా చెబుతున్నారు అని పూజాహెగ్డే తెలిపింది.