వారు చేసిన పనికి షాక్ లో పవన్ కళ్యాణ్..కారణం..?

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోసాని మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. అంతే కాదు వీరిద్దరూ కూడా రకరకాలుగా మాటలతో తగువులు ఆడుకుంటున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రమదానం కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కాస్త హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో పవన్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు గా మారుతున్నారు.

హుకుంపేట రైల్వే స్టేషన్ మధ్య రోడ్డు పై గుంతలు పూడ్చడానికి జనసేన తరలించిన మిక్సర్ వాహనాలను, పోలీసులు అడ్డుకున్నారు. ఈ వాహనాల్లో తారు మిక్సింగ్ చేసి ,గుంతలు పూడ్చేలా మెటీరియల్ సిద్ధం చేసిన జనసేనకు పోలీసులు షాక్ ఇచ్చారు. వీటిని గుంతలు ఉన్న ప్రాంతానికి తరలించకుండా పోలీసులు అడ్డుకున్నారు.. అయినా ఏదో ఒక లాగ తారు మిక్సర్లు తరలించడానికి జనసేన కార్యకర్తలు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు.. అంతేకాదు మరోపక్క పవన్ సభ జరిగే బాలాజీ పేట వద్ద కూడా కుర్చీలు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అంతేకాదు ప్రస్తుతం పవన్ ప్రసంగించే బస్ ఒకటే అక్కడ ప్రత్యక్షమౌతుండగా, దాని చుట్టూ కూడా పోలీసులు మోహరించారు.