బ్యాచిలర్ సినిమా ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ అతనేనట..?

యువ హీరో నాగార్జున కొడుకు అఖిల్ ప్రస్తుతం విడుదల కాబోతున్న చిత్రం బ్యాచిలర్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో అఖిల్.ఈ సినిమాతో నైనా సక్సెస్ కొట్టాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు ఈ యువ హీరో. అందుకోసమే స్టార్ హీరోయిన్ అటువంటి పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఈ మూవీ మేకర్స్ కన్ఫామ్ చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను బాగా గ్రాండ్ గా చేయాలని ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను గెస్ట్ గా యువ హీరో అఖిల్ సోదరుడు నాగచైతన్య స్పెషల్ గెస్ట్ గా తీసుకోబోతున్నారు ఆన్నట్లుగా సమాచారం.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్న ఈ దసరాకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక యువ హీరో నాగచైతన్య కూడా ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా అఖిల్ వంతు వచ్చింది అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే అక్టోబర్ 15 వరకు వేచి ఉండాల్సిందే.