ఆయన్ను ఏదైనా డాక్టర్ దగ్గరికి చూపించండి అంటూ కామెంట్ చేసిన మంచు విష్ణు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎన్నికల విషయం గురించే ఎక్కడ చూసినా మాట్లాడుకుంటూ ఉన్నారు సినీ ఇండస్ట్రీలో. అంతేకాకుండా మా సభ్యత్వం కోసం పోటీ పడుతున్న ప్రకాష్రాజ్ మంచు విష్ణు మీడియా ముందు ఒకరినొకరు ఎత్తిపోతల మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఇదే తరుణంలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు మంచు విష్ణు.

మంచు విష్ణు ఈ విధంగా మాట్లాడుతూ..ఉదయం ప్రకాశ్రాజ్ చెప్పిన ప్రతి అంశాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మా ఫైనల్ సభ్యులు పేపర్ బ్యాలెట్ కు వెళ్దాం అన్నారు. పేపర్ బాలెట్ చాలాసార్లు లెక్కించేందుకు అవకాశం ఉన్నది.మాలో 160 కి పైగా 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు వారిలో కొంతమంది నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారు.

ప్రకాష్ రాజు కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుందని మంచు విష్ణు తెలియజేశాడు.ఆయన ఒక అపరిచితుల వ్యవహరిస్తున్నాడు అంటూ మీడియా ముందు ముసలి కన్నీరు కారుస్తున్నారు. రియల్ లైఫ్ లోనూ ఆయన బాగా నటిస్తున్నాడు. నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి అని అంటున్నారు ఆయనకు పగ ద్వేషాలు ఎందుకు నాకు తెలియడం లేదు అంటూ మంచు విష్ణు కామెంట్ చేస్తున్నాడు. ఈవీఎంలు వద్దని “మా “కు లేఖ రాశా.. ఎందుకంటే గత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ వాడారు అయితే ఎన్నిసార్లైనా లెక్క పెట్టుకోవచ్చు EVM లు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మంచి విషయాలు తెలియజేశారు.