బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ చిందులు..!

ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ను కెలికి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల సాయి ధరంతేజ్ కి రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇండస్ట్రీలోని అందరూ ఆస్పత్రికి వెళ్లి తేజ్ ని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లలేని వాళ్ళు ట్విట్టర్ ద్వారా పరామర్శించారు. కానీ సొంత బంధువైన అల్లు అర్జున్ మాత్రం నింపాదిగా వారం రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

దీనిపై మెగా ఫ్యాన్స్ బన్నీని ఏకిపారేశారు. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఒక ట్వీట్ అయినా వెయ్యలేక పోయావా.. అని ట్రోల్స్ చేశారు. తాజాగా మరోసారి బన్నీ మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవి చూశాడు. నిన్న రాజమండ్రిలో అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ చిరంజీవిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు.

‘రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి గారు ఆవిష్కరించడం సంతోషం. తన తాత గారి గురించి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు హృదయానికి హత్తుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు నేను, మా అల్లు కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ట్వీట్ ని చూస్తే చిరంజీవిగారిని పరాయి వాడిలా భావించినట్టు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే మూడు ట్వీట్లు వేశావు..వెళ్లి ఇక రెస్ట్ తీసుకో.. పడుకో అంటూ..కౌంటర్లు వేశారు.

చిరంజీవి గారికి అల్లు రామలింగయ్య గారి కి మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అల్లు అరవింద్ బామ్మర్ది మాత్రమే కాదు.. చిరంజీవికి ఎంతో సన్నిహితుడు కూడా. ఇక అల్లు అర్జున్ హీరోగా ఎదగడానికి చిరంజీవి ఎంత సపోర్ట్ చేశాడో అందరికీ తెలిసిందే. రాజమండ్రి లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ తనకు అల్లురామలింగయ్య మామయ్యే కాదు.. తమ మధ్య గురుశిష్యుల అనుబంధం కూడా ఉందని.. ఎంతో గొప్పగా మాట్లాడారు. చిరంజీవి అల్లు ఫ్యామిలీ ని తన ఫ్యామిలీ గా భావిస్తూ ఉంటే.. అల్లు అర్జున్ ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పరాయి వాడిని చేశాడని మెగా ఫ్యాన్స్ బన్నీపై ట్రోల్స్ చేస్తున్నారు.