స్టార్ హీరోయిన్ చేసిన సినిమాను..మరో స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది.

అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడుతా..ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించండి.

ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలై హౌస్ ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ టబు నటించింది.అయితే ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ టబు నిర్ణయించలేదట. ఈ సినిమాలో నటించమని హీరోయిన్ మీనా ని అడిగారట డైరెక్టర్ కృష్ణ వంశీ.కానీ అప్పట్లో మీనా చాలా బిజీగా ఉండటం చేత ఆమె కాల్ సీట్లు ఖాళీగా లేవని తెలియజేసిందట.

అలా చెప్పడంతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సహాయంతో ఆయన ముంబైకి వెళ్లి కొంత మంది మోడల్స్ ని చూశాడు కృష్ణవంశీ. అలా చూసి హీరోయిన్ టబు ని సెలెక్ట్ చేసుకున్నాడు కృష్ణవంశీ. ఈ విధంగా హీరోయిన్ టబు ఈ సినిమాలో నటించిందని స్వయాన డైరెక్టర్ కృష్ణ వంశీని తెలియజేశాడు.