ఆపరేషన్ చేయించుకుంటున్న హీరో సిద్ధార్థ్..!

టాలీవుడ్ లో హీరో సిద్ధార్థ్ నటన పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక అంతే విధంగా తమిళంలో కూడా నటుడిగా సిద్ధార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్ధార్థ ప్రస్తుతం మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ అజయ్ భూపతి కావడం విశేషం. ఇక ఇందులో మరొక హీరో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు.

ఇక మహా సముద్రం సినిమాని దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 14న విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు అక్కడికి ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరు రాగ.. హీరో శర్వానంద్ అనుఇమ్మాన్యుయేల్ రాధా ఇందులో సిద్ధార్థ కనిపించకపోయేసరికి ఏమైందో అని ఖంగారు పడ్డారు. ఇక ఇందులో మరొక హీరోయిన్ అదితి రావు కూడా హాజరు కాలేదు. కానీ ఆమె సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేదని తెలియజేశారు.

ఇక హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియాలో లేదు లండన్ లో ఉన్నాడని అజయ్ భూపతి చెప్పే వరకు ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఎటువంటి ఆపరేషన్ కి వెళ్ళాడు ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇక తనకు సర్జరీ సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేయలేదని తన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆపరేషన్ సక్సెస్ కావాలి అని ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటూ.