ఇటీవల కాలంలో అక్రమ సంబంధం పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా మరో అక్రమ సంబంధం బయటకు వచ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ భార్య, పిల్లలతో హాయిగా ఉండక.. శారీరక సుఖం కోసం వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె భర్త చేత చితకబాధించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహితతో సదరు సీఐకి పరిచయం ఏర్పడగా.. చివరకు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో ఇంట్లో తెలియకుండా ఇద్దరూ ఎఫైర్ను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో.. సదరు మహిళ గత ఏడాదిన్నర నుంచి ఇంట్లోనే ఉంటోంది. అందువల్ల, సీఐ ఆమెను కలుసుకోలేకపోయాడు.
అయితే మొన్నీమధ్య స్కూళ్లు రీఓపెన్ కావడంతో ఇద్దరూ కలుసుకుని ఐదు రోజులు టూర్కి ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ మైసూర్లో జరుగుతున్న ఎడ్యుకేషన్ హబ్కి వెళ్తున్నానని భర్త దగ్గర పర్మిషన్ తీసుకోగా..సీఐ కూడా ఐదు రోజులు సెలవులు పెట్టేసుకున్నాడు. ఇక ఇద్దరూ స్కూల్ దగ్గరకు చేరుకుని టూర్కు బయలుదేరుతుండగా..స్కూల్ దగ్గరకి సడెన్గా సదరు వివాహిత భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఇక అక్కడ సీఐతో తన భార్యను చూసిన భర్త గట్టిగా ప్రశ్నించగా.. వారి గట్టు రట్టైంది. దాంతో సదరు వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులను పిలిపించి సీఐను చితకబాది హెచ్చరించి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్వీకరించలేదని సమాచారం..