నిందితుడు రాజు ట్రైను ముందు దూకే టప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షుల మాటలు..?

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో వారం రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి పరారైన నిందితుడు రాజు ఈ రోజున మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య చేసుకోవడం తాము చూశామని రైల్వే గ్యాంగ్ మాన్ చెబుతున్నాడు.

తాము ఉదయం డ్యూటీకి వెళ్లిన సమయంలో పట్టాల పక్కన నడుస్తున్న రాజు కనిపించాడని, రైలు పట్టాలపై ఇనుప వస్తువులు తీసుకెళ్లే వాడే ఏమో అనుకున్నాడు మొదట వెళ్లిపోవాలని చెప్పమని అన్నాడు. వెళ్లి పోక పోవడంతో ఎవర్రా బాబు అని పిలిచామని, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని అడిగితే ఏమీ చెప్పలేదని ఆ గ్యాంగ్ మేన్ తెలిపాడు.

అతడు రేపు చేసిన నిందితుడు రాజు అని గుర్తించామని.. తను చేసిన ఘటన గురించి మాట్లాడుతుండగా అతనిని పట్టుకుంటామేమో అనుకొని భయపడి రైలు కింద దూకేశాడు అని తెలియజేశాడు.అంతకు ముందు రైలు వచ్చిన దూరం గా నడుస్తూ కనిపించాడని, కేవలం పట్టుకుంటే కొడతారన్న భయంతో అతడు సూసైడ్ చేసుకున్నట్లుగా గ్యాంగ్ మేన్ తెలియజేశాడు. ఆ తరువాత 100 కు డయల్ చేసి సమాచారం ఇచ్చి ఉన్నట్లుగా తెలియజేశారు.https://fb.watch/82SxvJFUaG/