ఆ దేవుడు ఉన్నాడు.. నిందితుడు రాజుకు తగిన శిక్ష పడింది :మంచు మనోజ్

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో కొద్ది రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి మరీ ఆ పై దారుణంగా హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.అయితే ఆ నిందితుడి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పెరుగుతున్నప్పటికీ నిందితుడి ఆచూకీ లభించలేదు. దీనితో హైదరాబాద్ పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్న వారికి పది లక్షలు ఇస్తాము అంటూ ప్రకటన కూడా ఇచ్చారు.

 

ఇది ఇలా ఉంటే నిందితుడు రాజు మృతదేహం ఈ రోజు వరంగల్ జిల్లాలోని రైల్వే ట్రాక్ పై కనిపించింది. అయితే ఈ విషయం పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా ఆయన ట్వీట్ కు స్పందిస్తూ ఈ వార్త చెప్పినందుకు థాంక్యూ సర్ దేవుడు ఉన్నాడు ఓం శాంతి చైత్ర అంటూ మంచు మనోజ్ స్పందించాడు.