చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?

ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా హైదరాబాద్ లోనే హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఒక కామాంధుడి చేతిలో బలి అయిన ఆరేళ్ళ చిన్నారి విషయమే వినిపిస్తోంది. కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది అంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తున్నాయి అంటూ తెలిపారు.

అలాగే మన బిడ్డలు సురక్షితమేనా! అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలి పోవాలా? ఆ చిన్నదాని కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఃఖంలో మునిగిపోయిందో ఊహించలేం అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. హీరో మంచు మనోజ్ కూడా చనిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఆ చిన్నారిని అంత దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే చిన్నారి జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ఆ నిందితుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.