సాయి ధరమ్ తేజ్ ని కాపాడింది ఇతనే.. అతను పూర్తి వివరాలు?

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ లో ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు చోటు చేసుకుంది. అయితే సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే అతనికి కుడి కన్ను, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ టీవీ9 తో మాట్లాడాడు.

బైక్ లో నుంచి కింద పడగానే సాయి ధరమ్ తేజ్ స్పృహ కోల్పోయాడని, మేము 100 కి అలాగే 108 కి కాల్ చేసామ్ అని తెలిపారు. ఇక అతనికి తెలిసిన వ్యక్తులకు తెలియజేయాలని మొబైల్ ఓపెన్ చేయగా మొబైల్ లాక్ ఉండడంతో జేబులోని వాలెట్ తీస్తే అందులో డబ్బులు మాత్రమే ఉన్నాయి దీనితో 100 కి కాల్ చేసి సమాచారం ఇచ్చాను తెలిపాడు. అంతేకాకుండా ఆ ప్రమాదం జరిగింది హీరోకి అనే అప్పటికి నాకు తెలియదని, ఈ ఘటన తర్వాత రాయదుర్గం పోలీసులు కాల్ చేసి అతను హీరో అని చెప్పేంతవరకు నాకు అతను హీరో అని తెలియదని అతను చెప్పుకొచ్చాడు. ఇందుకు రాయదుర్గం పోలీసులు కాల్ చేసి అభినందించారు అని తెలిపాడు.