చార్మి అందుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ అందరికీ సుపరిచితమే. ఈమె తన అందంతో, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈమె నటన పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నది. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత.. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

2001వ సంవత్సరంలో నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగు పెట్టింది. ఈ సినిమాల్లో నటించేటప్పుడు ఈమె వయసు 14 సంవత్సరాలు. ఇక చార్మి అప్పుడు తను స్కూల్లో సెలవులు ఇవ్వడంతో ఆమె సినిమాలపై శ్రద్ధ పెట్టింది. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం సినిమాలలో నటించింది.

Neethodu Kaavali (2002) - 9by10

చక్రం, పౌర్ణమి, రాఖి, మాస్, ఆంటీ చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది.చార్మి 2007 సంవత్సరంలో వచ్చిన మంత్ర సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం ఈమె నటనకు దూరంగా ఉంటూ నిర్మాత బాధ్యతలు చేపడుతుంది. తన మొదటి సినిమాకి తనతో పాటి 500 మంది జూనియర్ ఆర్టిస్టులు రాగా అందులో తను ఒకటే.. సెలక్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక తాను తీసుకున్న మొదటి పారితోషకం 200 రూపాయలుగా చెప్పుకొచ్చింది ఛార్మి. అప్పుడు తను స్కూల్లో చదువుతున్న వయసులో ఆ రెమ్యూనరేషన్ అందుకు న్నట్టుగా చెప్పుకొచ్చింది.