బిగ్ బాస్ నుంచి సరికొత్త అప్డేట్.. ఖుషి లో ఉన్న కంటెస్టెంట్స్..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది .అదే బిగ్ బాస్ రియాల్టీ షో. ఈరోజు నుంచి ఈ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కాకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ దాదాపు 12 రోజుల నుండి క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ గత సీజన్ ఫోర్ సమయంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచగా, అప్పుడు ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో ఆ తర్వాత పూర్తిగా కోలుకోవడం జరిగింది.. ఈసారి మాత్రం ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ కేసు రాలేదట..

ఇందుకు గల కారణం.. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగా, ఇలాంటి పరిస్థితులు ఏర్పడ లేదు అని తెలుస్తోంది.. నిన్న కోవిడ్ టెస్ట్ చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రతి ఒక్కరు కూడా కరోనా 2 టీకాలు తీసుకున్నారట.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బయట వ్యక్తుల తో కలవకుండా కంటెస్టెంట్ లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి కచ్చితంగా మంచి రేటింగ్ సొంతం చేసుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల లో వార్త వినిపిస్తోంది.. నాగార్జున ఈ షో కి హోస్టు గా వ్యవహరిస్తున్నారు.. అయితే ఈ షో ఎలా అలరించనున్నదో చూడాలి అంటే , ఈ రోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే.