సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే ఈమె తెలుగు తమిళ,కన్నడ,మలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో విభిన్నమైన పాత్రల్లో నటించింది.పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత యమదొంగ వంటి చిత్రాలలో నటించింది.ఇక ఈమె హీరోయిన్గానే కాకుండా..బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నది.
ఇక ప్రియమణికి ఆ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి.కానీ చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మరొక హీరోయిన్ కి వెళ్ళిపోయింది.ఇక ప్రియమణి”రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మాన్”రెండు సీజన్లలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది.దీంతో ఈమె జాతీయ అవార్డు నటిగా కూడా సంపాదించుకుంది.
ఇక అసలు విషయానికొస్తే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించబోతున్నారట.ఇక ఈ సినిమాలో కథానాయకుడిగా నయనతార నటిస్తూ ఉండాలి,మరొక నటి గా ప్రియమణి ఎంచుకున్నట్లు సమాచారం. అందుకోసమే ఈమె ముంబై కి చేరుకున్నదని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు సంబంధించి షారుక్ ఖాన్ నయనతార, ప్రియమణి షెడ్యూల్లో ఉన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యేవరకు ప్రియమణి పూణే లోనే ఉంటుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.