ఆసుపత్రిలో చేరిన అడవి శేష్.. అసలేమైందంటే?

హీరో అడవి శేషు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి అస్వస్థతతో ఉన్న అతను నార్మల్ ఫీవర్ అనుకున్నాడట. అయితే ఆరోగ్య పరిస్థితి పై అనుమానం రావడంతో అతని స్నేహితులు హాస్పిటల్ తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు పరిశీలించిన అనంతరం అతను డెంగ్యూ బారిన పడినట్లుగా తెలుస్తోంది.

అలాగే  బ్లడ్ ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని సమాచారం. దాంతో ఆయన సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరాడు.. అతని పరిస్థితి వైద్యుల బృందం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జ్వరం పూర్తి తగ్గే వరకు కూడా అతని హాస్పటల్లో ఉండాలని వైద్య సిబ్బందులు తెలియజేశారు. ప్రస్తుతం అడవి శేషు మేజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అడవి శేషు తెలుగులో మరొక సినిమాకి సీక్వెల్ లో నటిస్తున్నాడు అన్నట్లుగా సమాచారం.

ఇక ఈ హీరో ఆరోగ్య విషయంపై చిత్ర నిర్మాతలు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నట్లు గా తెలుస్తోంది.