పోసానిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. నిహారిక షాకింగ్ కామెంట్స్..!

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ముందుగా వైసీపీ మంత్రులు మూకుమ్మడిగా పవన్ పై మాటల దాడి చేయగా, ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వరుసగా ఆయన రెండు రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పలు ఆరోపణలు చేశారు.

అయితే పోసాని కృష్ణమురళి పవన్ పై వ్యక్తిగత దూషణల చేయడమే కాక ఆయన కుటుంబ సభ్యులను కూడా దూషించారు. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించాడు. ‘కుక్క మొరగనీ ‘ అనే మీనింగ్ వచ్చేటట్లు మీమ్స్ ట్వీట్ చేశాడు. తాజాగా పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్లపై నాగ బాబు తనయ నిహారిక స్పందించింది. పోసానిని వెంటనే మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, జగన్ పై విమర్శలు చేసినందుకే పోసాని రియాక్ట్ అయ్యారని పేర్కొంది. నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రెస్ క్లబ్ దగ్గరికి భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని తరిమికొట్టారు. పోసాని పై దాడి చేసేందుకు ప్రయత్నించిన పవన్ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనసేన నాయకులు పోసాని కృష్ణ మురళి పై ఫిర్యాదు చేయడంతో ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.