సాయి తేజ్ కోరిక మేరకే 1న రిపబ్లిక్ విడుదల..ట్రైలర్ లాంచ్ లో చిరంజీవి..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న మూవీ రిపబ్లిక్. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. రాజకీయ వ్యవస్థకు,అధికార వ్యవస్థకు మధ్య పోరాటంగా ఈసినిమా సాగుతుందని సమాచారం.రిపబ్లిక్ ట్రైలర్ లో దేవకట్టా రాసిన సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

‘సమాజంలో తిరగడానికి అర్హత లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వారికీ కొమ్ముకాస్తున్నాయి.’ అంటూ సాయితేజ్ చెప్పిన డైలాగ్.. ‘ఆ రాక్షసులు ప్రపంచమంతటా ఉన్నారు రా..కానీ వ్యవస్థ వారిని పోషిస్తుందా.. శిక్షిస్తుందా.. అన్నదే తేడా…’అని జగపతి బాబు, ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’ అని రమ్య కృష్ణ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. ట్రైలర్ లాంచ్ చేసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘సాయి ధరంతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తేదీన నిద్ర చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకే.. అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది.మీ ఆదరణ అభిమానం ప్రేమే సాయి ధరంతేజ్ కి శ్రీరామరక్ష.’అని చిరు ట్వీట్ చేశారు.