టాలీవుడ్ లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఎంతో బాగా కలిసి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ గీత గోవిందం సినిమా తో బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఇప్పటికి కూడా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుపూతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి గురించి ఒక ఫోటో వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.
వెండితెరపై వీరిద్దరూ చేసేటటువంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.అంతే కాకుండా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ తన అభిమానులు అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరిద్దరూ కలుస్తూ ఉండడంవల్ల, ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జిమ్ములో కుస్తీ పడుతున్నాటు వంటి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వల్ల అవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక అందులోనే జిమ్ ఫిట్నెస్ కుల్దీప్ కూడా వీరి ఫోటోలలో భాగం అయ్యాడు.ఇక విజయ్ దేవరకొండ తో తన కున్నటువంటి రిలేషన్ మీద కొన్ని కామెంట్స్ చేసింది.అదేమిటంటే ఇద్దరం ఒకేసారి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చాము,మా ఇద్దరి మధ్య ఒక గొప్ప స్నేహం ఏర్పడింది అని చెప్పు వచ్చింది. కెరీర్ విషయంలో హీరో విజయ్ కొన్ని సలహాలను కూడా నాకు ఇస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది. ఇక ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి “ఆడవాళ్లు మీకు జోహార్లు” వంటి సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ భామ. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు.