టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి..?

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) దృష్టిసారించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరుగున పడ్డ ఈ కేసులో ఈడీ అకస్మాత్తుగా దూకుడు పెంచేసింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈ దృష్టి సాధించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులను ఎలా వ్యవహరించాలనే దానిపై విచారణ చేపట్టింది. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారు ఇచ్చిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీలు ఆధ్వర్యంలో ప్రశ్నించారు.

ఆ తరువాత మనీలాండరింగ్ జరిగి ఉండవచ్చని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. గతంలో వినియోగం వరకు ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. అదేవిధంగా ఈ కేసులో చికాగో ఇంటర్నేషనల్ రాకెట్ తో సంబందాలు ఉన్నట్టు ఆస్ట్రీయా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తోంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ నుంచి పూర్తి వివరాలు తీసుకుని ఈడి విచారించనుంది.