తమ ఆస్తులను అమ్ముకుంటున్న అభిషేక్ .. ఐశ్వర్యరాయ్..కారణం..?

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గురించి హాట్ టాపిక్ గా మారింది . ఆస్తులను అమ్ముకోనున్న అభిషేక్ – ఐశ్వర్య దంపతులు అని ఎక్కువగా వినిపిస్తున్నది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, అమితాబ్ బచ్చన్ న గతంలో ABCL కార్పొరేషన్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. అంతేకాకుండా ఒక అందాల పోటీ నిర్వహించడం ద్వారా ఫైనాన్షియల్ గా కూడా తగ్గిపోవడానికి ఒక కారణమని చెబుతున్నారు.

ఇక ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రాం లకు హోస్ట్ గా వ్యవహరించడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా ఆకట్టుకుని, తిరిగి తన ఆస్తులను కూడపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా అభిషేక్ బచ్చన్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్..తన భార్య ఐశ్వర్య రాయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే వీరిద్దరు ఒక హోటల్ ను కూడా అమ్మేసిన విషయం తెలిసిందే..దానిని 45.75 కోట్ల రూపాయలకు అమ్మేసారంట. అంతేకాదు ముంబైలో కూడా వీరికి 37 అంతస్తుల అపార్ట్మెంట్ ఉన్నది. ఆ అపార్ట్మెంట్ లో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ల ప్లాట్లు కూడా ఉన్నాయట. షాహిద్ అదే అపార్ట్మెంట్లో తన ఫ్లాట్ కోసం 53 కోట్ల రూపాయలుకు కొనుగోలు చేశారట. అక్షయ్ కుమార్ 52.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారట. కానీ అభిషేక్ బచ్చన్ దంపతులు మాత్రం అతి తక్కువ ధరకే ప్లాటు అమ్ముకున్నారు అట.

అయితే ఈ ఫ్లాట్ ను అతి తక్కువ ధరకు అమ్మడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నది. ఇక మరికొంతమంది సినిమాలు లేక అనుకుంటున్నారు… అయితే ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.