సమంత అద్భుత నటనా ప్రదర్శనకు దక్కిన మరో అవార్డు..!

నవరస నటనాభినయంతో, చక్కని రూపంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సమంత అక్కినేని తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో శ్రీలంక రెబల్ గా ఆమె కనబర్చిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆమె ఈ సిరీస్ లోని రాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకుల మెప్పుతో పాటు ఒక అవార్డు కూడా లభించింది.

తాజాగా ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివెల్ ఆఫ్ మెల్బోర్న్) 2021లో సమంత వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు. శ్రీలంకన్ తమిళ్ అమ్మాయి అయిన రాజీ రోల్ చాలా ఇంటెన్స్ పాత్ర అని ఆమె తెలిపారు. తనలోని నటనా నైపుణ్యాన్ని రాజీ పాత్ర బయటికి తీసుకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.