రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకున్న రకుల్.. ప్రస్తుతం తెలుగులో ఒక్కో ప్రాజెక్టూ చేయడం లేదు.
కానీ, బాలీవుడ్లో మాత్రం నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `డాక్టర్ జీ` ఒకటి. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ అలహాబాద్లో జరుగుతోంది. రకుల్ కూడా షూటింగ్లో పాల్గొంటోంది. అయితే ఈ మూవీ షూటింగ్ సెట్స్లో లంచ్ను ఫుల్లుగా లాగించిన రకుల్ ఓ కునుకు తీయాలని ఫిక్స్ అయింది. ఇదే విషయాన్ని తన ఫాలోవర్లను అడిగింది.
మంచిగా భోజనం చేశాక మధ్యాహ్నం కాసేపు పడుకోవడం ఎవరికి ఇష్టం అని రకుల్ ప్రశ్నించింది. అలాగే ఆయుష్మాన్ గురించి చెబుతూ.. స్వీట్లు పద్దతిగా ఎలా ఒకదాని తరువాత మరొకటి తినాలో అతడు అందరికీ చెబుతూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. మొత్తానికి రకుల్ పోస్ట్లు బట్టీ చూస్తుంటే.. డాక్టర్ జీ సెట్స్లో ఈమె మాస్తు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.