పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో నటించడం ఇదే మొదటి సారి. ఈమె కొద్దిగా బరువు పెరగడం చేత ఈమెకు అవకాశాలు చాలా తగ్గిపోయాయి. కానీ ఈ సినిమాలో మెయిన్ గా హీరోయిన్ పాత్ర వుండదు కాబట్టి అందుచేతనే ఈమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక అయితే ఈ సినిమా కోసమో, మరి ఇతర సినిమా కోసమో తెలియదు కానీ ఈమె బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భీమ్లా నాయక్ సినిమా తో ఈమె బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది అంటే, నిత్యామీనన్ క్రేజ్ మళ్ళీ తిరిగి పెరుగుతుంది అని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించడం వల్ల ఈమెకు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈమె టాలీవుడ్ లో అల్లు అర్జు,న్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన.. ఈమెకు మాత్రం గుర్తింపు రాలేదు. అయితే మరి ఈ సినిమాతోనైనా ఈమె మళ్లీ స్టార్ హీరోయిన్ లా పుంజుకుంటుందో ఏమో వేచి చూడాల్సిందే.