మంత్రి అవంతి శ్రీనివాస్.. వైరల్ గా మారిన ఆడియో..?

రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం పార్టీ వైయస్ఆర్ పార్టీ కాబట్టి ఇందులో జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తూ ఉన్నాడు. మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన మంత్రి అనే విషయం మర్చిపోయి, కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఎవరో తెలియని కొందరు ఆయన మాటలను రికార్డ్ చేసి, ఆడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.

ఒక మహిళ తో సరసాలు ఆడుతున్నట్టుగా ఉన్న ఆడియో.. ఇది మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి అని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.”పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. అరగంటలో ఇంటికి పంపి చేస్తా”. అంటూ ఒక మహిళ తో సరసాలాడుతూ వుండే ఒక సంభాషణ కలిగిన ఆడియోని మనం వినవచ్చు.ఇక అంతే కాకుండా ” నాతో ఒక గంటసేపు ఉండలేవా ? మాటలకు చేతలకు చాలా తేడా ఉంది..అని మాట్లాడుతున్న ఒక ఆడియో విడుదల కావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

అంతేకాకుండా ఈయన అవంతి ఆమెను ఎంతో బుజ్జగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వాయిస్ కన్ఫామ్ చేయలేకపోతున్నారు నెటిజెన్స్. అయితే ఈ ఆడియో అవంతిదా..? కాదా..? అనే నిర్థారణ కాకపోయినా కూడా, మంత్రి అవంతి దేనంటూ సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది ఈ ఆడియో. అంతే కాకుండా ఆయన మీద ప్రేక్షకులు కూడా గుప్పుమంటున్నారు.https://youtu.be/o8XRqjkunwM