సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు కొంతమంది దర్శకులు అచ్చు బాటు వచ్చినట్లు, మరికొంత మంది దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఒక బ్రాండ్ గా నిలిచి పోతుంటారు. అలాంటి వారిలో దర్శకుడు రాజమౌళికి కీరవాణి అయితే, సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ అన్నమాట. ఇక ఇదే విధంగా దర్శకుడు తేజ కి కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ కూడా వీరిలాగే ఉండేవారు. అంటే ఈ దర్శకులు చేసే ఏ సినిమాల కైన , మ్యూజిక్ డైరెక్టర్లు ఆ సినిమాలకు మ్యూజిక్ అందించడం ప్రత్యేకం.
అలా మొదటి సారి ఆర్పి పట్నాయక్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తర్వాత తేజ దర్శకత్వం వహించిన చిత్రం, నువ్వు-నేను ,ఫ్యామిలీ సర్కస్ ,జయం, నిజం వంటి చిత్రాలకు ఆర్ పి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది.
ఇక ఆర్. పి. తేజ దర్శకత్వంలలో వచ్చిన మహేష్ బాబు నిజం సినిమాకు ఏకంగా ఏడు పాటలను పాడడం జరిగింది. అయితే ఆర్.పి.పట్నాయక్ నిజం సినిమా కోసం నేను అలా పాడడం తప్పయింది అంటూ ఇటీవల చెప్పాడంతో.. ప్రస్తుతం ఈ మాట హాట్ టాపిక్ గా మారాయి.. ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ..” మహేష్ బాబు నటించిన నిజం సినిమా లో నేను పాటలు పాడి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో నాకు తప్పలేదు.. మహేష్ బాబు లాంటి అంత పెద్ద స్టార్ హీరో కి నా వాయిస్ సెట్ అవ్వలేదు. ఈ విషయం తెలిసి కూడా నేను తప్పక పాడాల్సి వచ్చింది..ఇదే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు “అంటూ.. తెలిపాడు
అంతేకాదు ఈ సినిమా తర్వాత పాటలు పాడడం మానేయ్ అని చాలామంది చెప్పారు అంటూ ఆయన తెలిపాడు. ఇక మహేష్ బాబు ఒక్కడు సినిమా తో మంచి క్రేజ్ పెరగడంతో నిజం సినిమా సరిగా ఆడలేదని తేజ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కాబట్టి ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్పి పట్నాయక్ ఇలా చెప్పుకొచ్చాడు.