జావలిన్ త్రో లో నీరజ్ చోప్రాకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..?

ఒలంపిక్స్ బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీ నజరానానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నందు నీరజ్ చోప్రా 450 రోజులపాటు జావెలిన్ త్రో కోసం విదేశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం ప్రభుత్వం దాదాపుగా 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట.

మొదటిసారి 2017లో నీరజ్ చోప్రా కోచ్ గా జావెలిన్ త్రో లో లెజెండ్ ఉవే హోన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇక 2019 సంవత్సరంలో చోప్రా మోచేతి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోచ్ గా డాక్టర్ క్లాస్ బోర్డు నియమితులయ్యారు. అప్పుడు ప్రభుత్వం రూ.1.22 కోట్ల రూపాయలను చెల్లించింది. అప్పుడు యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్ లో ఉన్నారు. అందుకోసం ప్రభుత్వం 19.22 లక్షలు ఖర్చు చేసింది.

ఈ విధంగా ఖర్చు చేసినందుకే ఇప్పుడు ఈయన స్వర్ణ పతాకం అందించాడు. అంతేకాదు వందేళ్ల నిరీక్షణ కు స్వర్ణ పతాకంతో స్వస్తి పలికాడు. ఎట్టకేలకు ప్రభుత్వం ఇతని కోసం చేసిన ఖర్చుకు పూర్తి న్యాయం చేశాడు అని చెప్పవచ్చు.