టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతక వేటలో పోరాడి ఓడింది. గ్రేట్ బ్రిటన్తో కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్లో 3-4 తేడాతో ఓడిపోయారు. ఫలితంగా భారత్కు కాంస్య పతకం చేజారింది.
అలాగే హాకీలో భారత్కు మరో పతకం వస్తుందన్న అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. అయితే భారత అమ్మాయిలు చివరి వరకు అద్భుతమైన పోరాటపటిమ చూపించారు. పురుషుల జట్టు బాటలోనే అమ్మాయిలు కూడా కాంస్య పతక పోరులో హోరాహోరీగా పోటీ పడ్డారు.
అయినప్పటికీ భారతజట్టు త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. పెనాల్టీ కార్నర్స్ను గోల్స్గా మార్చడంతో భారత జట్టు విఫలమైంది. కాగా, భారత ఫురుషుల హాకీ టీమ్ 41 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.