టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు ఏకంగా వెయ్యి మందికి సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు. అసలు సందీప్ కిషన్ ఎందుకీ ఆఫర్ ఇచ్చాడు అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
హాస్యనటుడు సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ ఇది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్య సరసన ఆర్జావీ రాజ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా ఆగస్ట్ సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్.. `వివాహ భోజనంబు` సినిమా రెండు గంటలపాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమని, ఈ చిత్రంతో కొంతమంది కొత్త వారిని పరిచయం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సందీప్ చెప్పుకొచ్చాడు. అలాగే మా ఈ సినిమా రిలీజ్ పోస్టర్తో మీ ఫ్యామిలీ ఫోటో జతచేసి షేర్ చేయాలని, అలా పోస్ట్ చేసిన తొలి 1000 మందికి తన నుంచి సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు. మరి సందీప్ అందుకునే ఆ వెయ్యి మంది లక్కీ వీరులెవరో చూడాలి.