కేజీయఫ్ 2 సౌత్ సాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న ఆ సంస్థ..!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధమవుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం.. కేజీయఫ్ 2! దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా.. శ్రీనిధి శెట్టి కథానాయికగా “కేజీయఫ్ చాప్టర్ 2” మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ఒక అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.

కేజీయఫ్ 2 సినిమాకి సంబంధించిన సౌత్ ఇండియన్ అన్ని ప్రధాన భాషల శాటిలైట్ హక్కులను జీటెలివిజన్ సంస్థ వారు సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ వారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని యష్ పేర్కొన్నారు. అయితే ఈ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్ ఇంకా ఎవరు కైవసం చేసుకోలేదని సమాచారం. సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని హోంబలె పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది.