గాంధీ ఆస్పత్రిలో.. కళ్ళు తాగిన మత్తులో.. గ్యాంగ్ రేప్..? నమ్మలేని నిజాలు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వరుస గ్యాంగ్ రేప్ లు, వరుస హత్యలతో.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు యువతులు. ఇక అలాంటి ఒక దుర్ఘటన చోటు చేసుకుంది గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఒక యువతి పై గ్యాంగ్ రేప్ జరిగిందని , పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఒకసారిగా నగరవాసులు ఉలిక్కిపడ్డారు.

అలా ఒక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కనిపించకుండా పోవడం తో బాధితురాలు మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసులు మీద దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తీరా కనిపించకుండా పోయిన ఆ యువతి ఆచూకీ గురువారం లభించడంతో గ్యాంగ్రేప్ మిస్సింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ అసలు జరగలేదని తేల్చి చెప్పేశారు. అక్కడ చేసిన పనిని కప్పి పుచ్చెందుకు కేవలం తన సోదరి మాత్రమే ఇలాంటి కట్టు కథ అల్లినట్లు తెలిపారు. ఈ అక్క చెల్లి ఇద్దరికీ కల్లు తాగే అలవాటు ఉన్నట్లు విచారణలో తేలింది. కేవలం వీరి కళ్ళు తాగే అలవాటు ను నివారించడానికి.. ఆస్పత్రి దగ్గరికి వెళ్లేవారట. ఇక ఇప్పటికే వీళ్ళు కళ్ళు తాగి రావడంతో.. తన అక్క అక్కడున్న వాచ్ మెన్ తో వెళ్ళిపోయింది. సోదరి మత్తుకు అపస్మారకస్థితిలో ఆస్పత్రిలోనే పడిపోయింది.

బంధువులు వచ్చి తమ అక్క చేసిన పనికి తప్పును కప్పిపుచ్చుకునేందుకు తనపై గ్యాంగ్రేప్ జరిగిందని, కథలు అల్లు కొచ్చారు. అదే నిజమని నమ్మిన బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో మూడు రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడే కాకుండా సంతోష్ నగర్ లో ఉంటున్న ఆటోడ్రైవర్ తనని రేప్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులు కూడా ఒట్టి అబద్ధమే అని పోలీసులు తేల్చారు. ఇక తన ప్రియుడు వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఉద్దేశంతోనే ఈమె ఇంత నాటకం ఆడినట్లు వెల్లడిస్తోంది. ఈ రెండు ఘటనలు సంబంధించిన విషయాన్ని నగర సి వి అంజనీకుమార్ ఒక మీడియా ద్వారా తెలియజేశారు.