ఏ ఒక్కటి నాకు తృప్తి ఇవ్వలేదు అంటున్న పాగల్ హీరోయిన్..?

విశ్వక్ సేన్ , నివేద సేతురాజ్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం పాగల్.. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ ” నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే అంచనాలు ఉండవు అంటూ తెలియజేస్తున్నది” ఈ భామ. ఇక ఈ నెల 14న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదే సందర్భంగా నివేద మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం నరేష్ గారు ఈ సినిమా కథ నాకు తెలియజేశారు.. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఐదు సార్లు నాకు ఈ కథ వినిపించాడనీ తెలియజేసింది.. ఇక ఈ కథ నాకు బాగా కనెక్ట్ అవ్వడం తో ఓకే చెప్పేశాను అని తెలియజేసింది.

ఇక ఈ కథను నాతో పాటే దిల్ రాజు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే నేను కూడా ఈ సినిమా కి కనెక్ట్ అయ్యాను అని తెలియజేసింది. ఇక ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉంటుంది అని తెలియజేసింది. చిత్రలహరి, బ్రోచే వారెవరు.. వంటి సినిమాలలో ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లను చేశాను. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ వస్తుంది అనుకోలేదు అని తెలియజేసింది.

నేను కేవలం చూడడానికి సీరియస్ అమ్మాయిల కనిపిస్తాను నేను నిజానికి ఇలా ఉండను అని మాట్లాడుతూ.. వేరొక ఫీల్డ్ లో అవగాహన పెంచుకోవాలని ప్రస్తుతం రేసింగ్ లో ఫస్ట్ లెవెల్ పూర్తి చేశాను. రేసింగ్ ట్రైనింగ్ ఆప్పుడే కొత్త సినిమాలు కమిట్ అయ్యాను. ఇక తెలుగులో ఒకటి తమిళంలో రెండు సినిమాలు చేస్తూ ఉన్నాను అని తెలియజేసింది నివేద పేతురాజ్.