గుడ్‌న్యూస్‌..దేశంలో భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు..!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకున్న త‌రుణంలో.. అనూహ్యంగా క‌రోనా ఊపందుకుంది.

అయితే నిన్న మాత్రం క‌రోనా కేసుల సంఖ్య భారీగా ప‌డిపోయింది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 28,204 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,98,158 కు చేరుకుంది. అలాగే నిన్న 373 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,28,682 కు పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 41,511 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,11,80,968 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,88,508 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 15,11,313 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.