చిరంజీవి సినిమాలో మరొక యంగ్ హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక చిరంజీవి దాదాపుగా 65 సంవత్సరాలు అయినా సరే అతను ఇంక కుర్రహీరో మాదిరే కనిపిస్తున్నాడు. అయితే చిరంజీవి నటించబోతున్న ఒక కొత్త సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె గురించి తెలుసుకుందాం.

డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని సెకండ్ హీరోయిన్ గా.. సమ్మోహనం హీరోయిన్”అతిథి రావు హైదరి” ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ సోనాక్షి సిన్హా పేరు వినిపిస్తున్నా , ఆమె చెప్పిన కండిషన్లకు ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

ఇక అతిథి రావు ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో నటించడంతో ఈమె క్రేజ్ పెరుగుతుందని ఉద్దేశంతో ఇమేజ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న చిత్రంగా తెలుస్తూనే ఉంది. ఈ బ్యానర్ లో చిరంజీవి నటించడం ఇదే మొదటి సారి.Aditi Rao Hydari: I feel the film industry is an inclusive space | People  News | Zee News

అతిధిరావు హైదరి ఇదివరకే కొన్ని సినిమాలలో చేసినా, ఆమెకు ఆశించిన ఫలితం రాలేదు. అయినా చిరంజీవి సినిమాలో నటించడానికి అవకాశం వస్తే అతిధి రావు ఫ్యూచర్ కు ప్లస్ అవుతుందని ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా స్టార్ హీరోగా నటించడం వల్ల పలు సినిమాలలో అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ హీరోయిన్ నుంచి సినిమాల్లో నటిస్తున్నది లేదు తెలియాల్సి ఉంది. ఇక డైరెక్టర్ బాబి కూడా ఈమెను తీసుకోవాలని చూస్తున్నారట.