శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించనుండగా.. ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్రలో రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 19న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖి.. తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి చేసుకునేందుకు తనకూ తొందరగానే ఉందని.. కానీ, మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని శ్రీముఖి తెలిపింది. ఇక ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. సో 31 ఏళ్లు వచ్చేసరికి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది.