తల్లి కాబోతోన్న బుల్లితెర నటి..?

ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బుల్లితెరపై మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా బుల్లి తెర నటి అయిన చైత్ర రాయ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతోన్నట్టు తెలిపారు. తన జీవితంలో ఇదొక సరికొత్త దశ అని చాలా అద్భుతంగా అనిపిస్తోందని ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి చైత్ర రాయ్ తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

అష్టా చమ్మ, అలా మొదలైంది వంటి సీరియల్స్‌తో తన నటనతో మెప్పించారు. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా చైత్రకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్ హీరోయిన్ తెలుగులో ఒకరికి ఒకరు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ వంటి సీరియల్స్ ను చేస్తూ బిజీగా ఉన్నారు. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం ఆమె కొన్ని రోజుల పాటు గ్యాస్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.