మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి.
ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉందట. ఈ పాత్ర క్లైమాక్స్ లో వస్తుందట.
అయితే ఈ రోల్ కోసం మేకర్స్ సునీల్ శెట్టిని సంప్రదించగా.. ఆయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.