టాలీవుడ్ లో దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను మళయాలంలో మోహన్ రాల్, తమిళ్ లో కమల్ హాసన్ నటించి బాగా రక్తి కట్టించారు. ఈ సినిమా అన్ని చోట్లా కూడా అద్భుతంగా కాసులు వసూలు చేసింది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్, ఆ నాటి అందాల తార మీనా నటించారు.
మళయాలంలో మోహన్లాల్, మీనా అలాగే తమిళంలో కమల్ హాసన్, గౌతమి కలిసి నటించి మెప్పించారు. అయితే ఈ సంవత్సరం మలయాళంలో `దృశ్యం2` కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైంది. తెలుగులో కూడా ఇది హాట్ స్టార్ లో విడుదలవ్వనుంది. అయితే తమిళంలో `దృశ్యం2`ను కమల్ ఈ సారి గౌతమితో కాకుండా వేరే నటితో చేయనున్నారు. కమల్ నదియాని గౌతమి స్థానంలో ఉంచి నటించనున్నట్లు సమాచారం. అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎవరిని తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.