ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్న కూడా కరోనా కేసులు స్వలంగా దిగిరానా.. మరణాలూ తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్లో 35,342 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,93,062 కు చేరుకుంది. అలాగే నిన్న 483 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,19,470 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 38,740 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,04,68,079 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,05,513 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నొక్కరోజే దేశవ్యాప్తంగా 16,68,561 కరోనా టేస్ట్లు నిర్వహించారు.