ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు భారీగా పెరిగితే.. మరణాలు స్వల్పంగా తగ్గాయి.
గత 24 గంటల్లో భారత్లో 41,157 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,06,065 కు చేరుకుంది. అలాగే నిన్న 518 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,13,609 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 42,004 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,02,69,796 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,22,660 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్నొక్క రోజే దేశంలో 19,36,709 కరోనా టెస్ట్లు నిర్వించారు.