అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెలివిజన్ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఈ షో తర్వాత సెలబ్రెటీలను వరుస ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది.
తన పేరు మీద ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ కావడంతో.. అరియాలు నెటిజన్లు మరియు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.
https://www.instagram.com/p/CQ5NrddJIR1/?utm_source=ig_web_copy_link